హైదరాబాద్ పోలీసులు భారీగా డ్రగ్స్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డార్క్నెట్ ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను ఛేదించారు. ఈ కేసులో ఎనిమిది మంది పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద 140 గ్రాముల చరస్, 1450 గ్రాముల గంజాయి, 184 ఎల్ఎస్డీ బ్లాట్లు, 10 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్లోని అన్ని లావాదేవీలు క్రిప్టోకరెన్సీ చెల్లింపు ద్వారా జరుగుతాయి. ఈ అరెస్టులకు అంతర్జాతీయ కార్టెల్స్తో సంబంధం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రధాన నిందితుడు నరేంద్ర సోషల్ మీడియా నెట్వర్క్ల సహాయంతో డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ట్రాఫికింగ్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.