హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని నిర్లక్ష్యంతో జరిగితే, మరికొన్ని అతివేగం కారణంగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ అపార్ట్ మెంట్ లో ఎండ వేడిమి తట్టుకోలేక సెల్లార్ లో మూడేళ్ల పాప నిద్రపోతోంది. అయితే విషయం గమనించగా కారు ఓనర్ పాపపై నుంచి కారును పోనివ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
తాజాగా జరిగిన ఓ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఘోరం జరిగింది. రోడ్డుపక్కన ఆగివున్న కారు డోర్ సడెన్గా తీయడంతో చిన్నారితో కలిసి బైక్పై వెళ్తున్న దంపతులు కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో రెండేళ్ల పాప ధనలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సీసీ పుటేజ్ వైరల్ అవుతోంది.
ఈ ప్రమాదంలో చిన్నారి తల్లి శశిరేఖకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న ఆ భర్త కూడా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శశిరేఖను దగ్గర్లోని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Also Read: Mamata Banerjee: మమతా మానవత్వం, గాయపడ్డ జర్నలిస్టును కారులో ఆస్పత్రికి తరలించిన సీఎం!