Telangana: హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్

బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శ్వేతను పార్టీలోకి ఆహ్వానించారు . శ్వేత తన పదవికి ఇబ్బందిగా భావించి కాంగ్రెస్‌కు విధేయత చూపినట్లు సమాచారం.

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, 11 మంది మంత్రులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి నేతలు క్యూ కడుతున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శ్వేతను పార్టీలోకి ఆహ్వానించారు . శ్వేత తన పదవికి ఇబ్బందిగా భావించి కాంగ్రెస్‌కు విధేయత చూపినట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఓ వర్గం కౌన్సిలర్లు ఆమెపై త్వరలో అవిశ్వాసం పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జక్కుల శ్వేత హస్తం గూటికి చేరారు. ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ అయిన శ్వేత బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికై 2019లో మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

Also Read: Revanth Reddy Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం