Philippines: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదు

ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని మిండోరోలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Philippines

Earthquake 1 1120576 1655962963

Philippines: ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని మిండోరోలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2.19 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 124 కిలోమీటర్ల లోతులో ఉంది.

ఫిలిప్పీన్స్ లో గురువారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, ప్రకంపనల కార‌ణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. రాజధాని మనీలాకు 120 కిలో మీట‌ర్ల దూరంలో, 10 కిలో మీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మై ఉంద‌ని తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించిన తర్వాత తాను, తన సిబ్బంది బయటకు పరుగులు తీసిన‌ట్టు కలటగాన్ మున్సిపాలిటీ పోలీస్ చీఫ్ ఎమిల్ మెండోజా తెలిపారు. ప్ర‌స్తుతం సంభ‌వించిన భూకంప ప్ర‌భావం చాలా అధికంగానే ఉంద‌నీ, ప్ర‌కంప‌న‌ల స‌మ‌యంలో తాము ప‌రుగెత్తాల్సి వ‌చ్చింద‌ని మెండోజా వెల్ల‌డించారు.

Also Read: United Kingdom: యూకేలో భారత సంతతి విద్యార్థి సహా ముగ్గురు మృతి.. అసలేం జరిగింది.. పోలీసులు ఏం చెప్తున్నారు..?

భూకంపం 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు కొనసాగిందని కలాటగన్ విపత్తు అధికారి రోనాల్డ్ టోరెస్ తెలిపారు. భూకంపం కారణంగా రాజధాని ప్రజలు కూడా అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు పౌర రక్షణ కార్యాలయంలోని సమాచార అధికారి డియెగో మారియానో ​​తెలిపారు. అక్టోబర్ 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు.

  Last Updated: 15 Jun 2023, 11:33 AM IST