Site icon HashtagU Telugu

Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ

The entire country is happy and proud of your journey: PM Modi

The entire country is happy and proud of your journey: PM Modi

Shubhanshu Shukla : అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌కు మరొక అద్భుతమైన ఘనత చేకూరింది. యాక్సియం స్పేస్ చేపట్టిన నాలుగో అంతర్జాతీయ మిషన్ అయిన యాక్సియం-4 (Axiom-4) లో భాగంగా, భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బుధవారం ప్రారంభం అయ్యారు. ఆయన ఈ మిషన్‌లో గ్రూప్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు స్పందిస్తూ, శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపారు.

Read Also: MLC Kavitha :ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ

రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ .. భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్‌గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగా ఉన్న యాక్సియం-4 మిషన్ ప్రపంచానికి ఒకటే కుటుంబమని తెలియజేస్తోంది. నాసా–ఇస్రో భాగస్వామ్యం ద్వారా అంతరిక్షంలో అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారని ఆశిస్తున్నాను అని రాష్ట్రపతి అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..శుభాంశు శుక్లా, భారత్ తరపున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్న తొలి గ్రూప్ కెప్టెన్. ఇది కేవలం వ్యక్తిగత గౌరవం కాదు, కోట్లాది భారతీయుల కలలకు సాక్ష్యంగా నిలిచే సంఘటన. ఆయన సాధన యువతకు ప్రేరణగా మారుతుంది. యాక్సియం-4 మిషన్ విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

కాగా, బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం), నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్, ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. కొన్ని నిమిషాలకే వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూమి చుట్టూ గిరకేసే కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రయాణంలో భారత్‌తో పాటు హంగేరీ, పోలాండ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకి చెందిన వ్యోమగాములు కూడా భాగస్వాములయ్యారు. మొత్తం 28 గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం 4:30 గంటలకు (IST) ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) తో అనుసంధానమవుతుంది. శుభాంశు శుక్లా మరియు ఆయన బృందం ISSలో 14 రోజుల పాటు ఉంటారు. ఈ సమయంలో తేలికపాటి స్థితిలో వివిధ శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. అంతేకాక, ప్రధాని మోడీతో పాటు భారత పాఠశాల విద్యార్థులతో అంతరిక్షం నుంచి ప్రత్యక్షంగా మాట్లాడే కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశారు. ఈ మిషన్ విజయవంతం కావడం ద్వారా భవిష్యత్‌లో భారత అంతరిక్ష ప్రయోగాలపై విశ్వాసం పెరుగుతుందని, అంతరిక్ష పరిశోధనలో భారత్ కీలక భాగస్వామిగా కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Rain : హైదరాబాద్‌లో మధ్యాహ్నం వర్ష బీభత్సం..ట్రాఫిక్‌కు అడ్డంకులు, వాహనదారులకు ఇబ్బందులు