Rajya Sabha MP Sanjay Raut: ఏకే- 47తో కాల్చి చంపుతానని సంజయ్ రౌత్ కు బెదిరింపు

శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ (Rajya Sabha MP Sanjay Raut)ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేస్తానని బెదిరించింది. దీంతో సంజయ్ రౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 01:37 PM IST

శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ (Rajya Sabha MP Sanjay Raut)ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేస్తానని బెదిరించింది. దీంతో సంజయ్ రౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు పంజాబీ సింగర్ సిద్ధూ ముసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నిందితులుగా ఉన్నారు.

ముప్పులో సిద్ధూ ముసేవాలా ప్రస్తావన

శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంజయ్ రౌత్‌ను సిద్ధూ ముసేవాలా గ్యాంగ్ లాగా చంపేస్తామని బెదిరించారు. ఈ విషయమై సంజయ్ రౌత్ ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం.. సంజయ్ రౌత్‌కు పంపిన బెదిరింపు సందేశంలో ‘ఢిల్లీలో దొరికితే నేను నిన్ను ఎకె- 47తో కాల్చివేస్తాను’ అని ఆ మెసేజ్ లో ఉంది.

తనకు బెదిరింపు సందేశం వచ్చిందని సంజయ్ రౌత్ తెలిపారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాను. నేను భయపడను ఇంతకు ముందు కూడా నాపై దాడికి ప్రయత్నాలు జరిగాయి.. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు? హోంమంత్రి ఏం చేస్తున్నారు? మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా భద్రతను తొలగించారని సంజయ్ రౌత్ అన్నారు. ఇప్పుడు మాకు హత్య బెదిరింపులు వస్తున్నాయని ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: YS Sharmila: కేసీఆర్ కు షాక్.. రేవంత్, బండికి షర్మిల ఫోన్!

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతేడాది కూడా సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌లకు బెదిరింపు లేఖలు పంపింది. ఈ బెదిరింపు లేఖ సల్మాన్ ఖాన్ ఇంటి బయట దొరికింది. దీనిపై లారెన్స్ బిష్ణోయ్‌ని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందినవాడు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణజింకను పూజిస్తారు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ గ్యాంగ్ బెదిరింపులకు గురిచేస్తోందని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలాను గతేడాది కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ముసేవాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిందని ఆరోపించారు. ముసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్‌కు కూడా గతంలో బెదిరింపు సందేశాలు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై కూడా ఆరోపణలు వచ్చాయి.