CBSE Students: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Students) పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యార్థులు ముమ్మరంగా సిద్ధమవుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న విద్యార్థులకు ఈసారి సీబీఎస్ఈ కొంత సడలింపు ఇచ్చింది. మీకు మధుమేహం ఉంటే మీరు బోర్డు పరీక్షలలో స్నాక్స్ తీసుకెళ్లవచ్చు. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఈ మార్గదర్శకాలు అమలు చేశారు. వారి ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించేందుకు సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది.
టైప్-1 మధుమేహంతో బాధపడుతున్న విద్యార్థులు తమ వైద్య పత్రాలను CBSE పోర్టల్లో అప్లోడ్ చేయవచ్చు. దీని ఆధారంగా పరీక్ష సమయంలో ఆహారాన్ని తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. అలాంటి విద్యార్థులు మందులు, చాక్లెట్లు, క్యాండీలు, పండ్లు, స్నాక్స్, వాటర్ బాటిళ్లు, గ్లూకోజ్ టెస్టింగ్ స్ట్రిప్స్, గ్లూకోమీటర్ను పరీక్ష హాల్కు తీసుకెళ్లవచ్చు. వాటర్ బాటిల్ అర లీటరు సామర్థ్యంతో పాటు పారదర్శకంగా కూడా ఉండాలి. విద్యార్థులు అరటి, యాపిల్, ఆరెంజ్ వంటి పండ్లను, శాండ్విచ్ల వంటి స్నాక్స్ను కూడా తీసుకెళ్లవచ్చు.
Also Read: Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?
ఒక రోజు ముందుగా తెలియజేయాలి
దీని కోసం విద్యార్థులు SOPను అనుసరించాలి. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలనుకుంటున్నారో పరీక్ష ప్రారంభానికి కనీసం ఒకరోజు ముందు సెంటర్ సూపరింటెండెంట్కు తెలియజేయాలి. అలాగే పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 10, 12వ తరగతి పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగుతాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం..బెంగళూరులో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ సమానాను తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. దీన్ని ఖండిస్తూ అధికారి రాసిన లేఖ వైరల్గా మారింది. దీని తర్వాత అతను ఇన్సులిన్ పంప్, కార్బోహైడ్రేట్ స్నాక్స్ తీసుకెళ్లడానికి అనుమతి పొందాడు. 2017 సర్క్యులర్లో మధుమేహంతో బాధపడుతున్న విద్యార్థులు స్నాక్స్, నీటిని మాత్రమే పరీక్ష హాల్కు అనుమతించారు. అయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ విద్యార్థులను ఇన్సులిన్ పంపులు, గ్లూకోమీటర్లను తీసుకెళ్లడానికి అనుమతించాలని ఆదేశించింది.