Site icon HashtagU Telugu

Tata Group: విమాన ప్రమాద బాధితులకు రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్

Tata Group

Tata Group

Tata Group: ఎయిరిండియా విమానం ఏఐ 171 ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాలకు సహాయం అందించేందుకు టాటా సన్స్ రూ. 500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం గురువారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో తీసుకోబడింది. ఇందులో ట్రస్ట్ ఏర్పాటు ప్రతిపాదనను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్వయంగా ముందుకు తెచ్చారు. తదుపరి నుంచి ఎయిరిండియా రోజువారీ కార్యకలాపాలను ఆయనే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు.

ట్రస్ట్ లక్ష్యాలు – సమగ్ర సహాయం

ఈ ట్రస్ట్ ద్వారా మొత్తం 271 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించనున్నారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులు, ప్రమాద ప్రాంతంలోని మెడికల్ కాలేజీ పునరుద్ధరణ, శకలాల కారణంగా కలిగిన నష్టాల పునరుద్ధరణ వంటి అవసరాల కోసం నిధిని వినియోగించనున్నారు. మిగిలిన నిధిని బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాల కోసం నిల్వచేసేందుకు భావిస్తున్నారు.

ట్రస్ట్ పర్యవేక్షణ బాధ్యతను టాటా మోటార్స్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ చేపట్టనున్నారు. త్వరలోనే ఈ ట్రస్ట్‌ను అధికారికంగా రిజిస్టర్ చేసి, దేశీయ, అంతర్జాతీయంగా ఉన్న బాధిత కుటుంబాలకు నేరుగా సహాయం చేయనున్నారు.

టాటా సంప్రదాయం కొనసాగింపు

ఈ ప్రమాదాన్ని టాటా గ్రూప్ అత్యంత ఘనంగా పరిగణిస్తోంది. సంస్థకు ఇది తీవ్రమైన సవాలుగా మారిన నేపథ్యంలో, ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ప్రభుత్వం, ప్రయాణికుల భద్రత, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం తదితర అంశాలను ఆయనే పర్యవేక్షించనున్నారు.

ఇది టాటా సంప్రదాయం కొనసాగింపుగా చెప్పవచ్చు. గతంలో 1989లో టాటా స్టీల్ అగ్నిప్రమాదం, 26/11 తాజ్ ఉగ్రదాడిలో రతన్ టాటా స్వయంగా బాధితుల సహాయానికి ముందుకొచ్చినట్లే, ఇప్పుడూ చంద్రశేఖరన్ అదే బాధ్యతతో ముందుకొస్తున్నారు.

Bigboss 9: బిగ్ బాస్ 9 సీజన్ సెప్టెంబర్‌లో స్టార్ట్.. హోస్ట్‌గా మళ్లీ నాగార్జుననే ఫిక్స్