తమిళ నటుడు సూర్య నటించిన జైభీమ్ చిత్రం మరో వివాదానికి దారి తీసింది. వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చినందుకు సూర్య,జ్యోతిక,దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం నవంబర్ 15న లీగల్ నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసుల తరువాత సూర్యకు బెదిరింపులు రావడంతో టీ నగర్ లోని ఆయన ఇంటికి సాయుధ పోలీసులతో రక్షణ కల్పించారు. ప్రస్తుతం టి నగర్లోని తయన ఇంటి వెలుపల ఐదుగురు పోలీసులు ఆయుధాలతో మోహరించారు.
Also Read : జై భీమ్ వీడియో క్లిప్ లో ఏముంది? ఎందకంతా కంట్రావర్సీ?
జై భీమ్లోని కొన్ని సన్నివేశాలు వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చాయని నోటీసులో పేర్కొన్నారు. సంఘం బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నోటీసు తర్వాత వన్నియార్ సంఘం సభ్యులు సూర్యకు బహిరంగ బెదిరింపులు చేశారు. పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకె) నాగపట్నం జిల్లా కార్యదర్శి సీతమల్లి పజాని సామి కూడా నటుడిపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. జై భీం చిత్రానికి TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా సూర్య నటించారు. ప్రొడ్యూసర్ గా జ్యోతికా ఉన్నారు.