Pooja Hegde: బ్రదర్స్, కజిన్స్ తో పూజాహెగ్డే రాఖీ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

సంప్రదాయ దుస్తులు ధరించి తన సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించింది.

  • Written By:
  • Updated On - August 31, 2023 / 04:38 PM IST

ఏ పండుగ వచ్చినా సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు ఘనంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, హోలీ వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. అయితే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ విషయంలో కూడా ముందుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలే అందుకు ఉదాహరణ. గురువారం రాఖీ పౌర్ణమి కావడంతో ముద్దుమ్మ ఇంట్లో సంప్రదాయ దుస్తులు ధరించి తన సోదరులకు రాఖీలు కట్టింది. మిఠాయిలు తినిపించింది.

కొన్ని గంటల్లోనే, పూజా హెగ్డే తన సోదరుడు, కజిన్స్ కు రాఖీలు కట్టిన ఫోటోలను పంచుకుంది, దీనికి లక్షల లైక్‌లు వచ్చాయి. కేవలం 5 గంటల్లోనే లక్షా 33 వేల మంది లైక్స్ వచ్చాయి. అందరూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతుండగా, మీరు కూడా ఇంత పొద్దున్నే నిద్ర లేచి నాలాగా రాఖీ కట్టారా అని కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

కాగా స్టార్ హీరోలు, హిట్‌ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో రెమ్యూనరేషన్ బాగానే తీసుకుంటుంది. ఆవిషయం పక్కన పెడితే ఏదైనా షాప్, షోరూం ఓపెనింగ్ చేస్తే భారీగానే పారితోషికం తీసుకుంటుంది.  రాయలసీమలో వస్త్రదుకాణం ప్రారంభించడానికి వచ్చిన ముద్దుగుమ్మ కేవలం కొన్ని గంటలు మాత్రమే కడపలో ఉంది. ఆ కాసేపు ఉండి షోరూం లాంచ్ చేసినందుకు భారీగానే చార్జ్ చేసిందని తెలుస్తోంది. షోరూం రిబ్బన్ కట్ చేసి కొన్ని గంటలు ఉన్నందుకు 40లక్షల పారితోషికం తీసుకుందని తెలిసి జనం షాక్ అవుతున్నారు.

Also Read: Urvashi Rautela: ఒక నిమిషానికే కోటి రెమ్యూనరేషన్, పవన్ కు షాక్ ఇచ్చిన ఐటెం బ్యూటీ!