Bollywood Khans: ఈ దేశం ‘ఖాన్స్’ ను మాత్రమే ప్రేమిస్తోంది.. కంగనా ట్వీట్ వైరల్!

బాలీవుడ్ పై ఇప్పటికీ ఖాన్ ల ఆధిపత్యమే కొనసాగిస్తుందా? ప్రేక్షకులు కూడా ఈ ఖాన్ త్రయానికే సలాం చేస్తున్నారా?

  • Written By:
  • Updated On - January 30, 2023 / 11:57 AM IST

దేశంలోని అతిపెద్ద ఎంటర్ టైన్ మెంట్ అయిన బాలీవుడ్ (Bollywood) పై ఇప్పటికీ ఖాన్ ల ఆధిపత్యమే కొనసాగుతుందా? ప్రేక్షకులు కూడా ఈ ‘ఖాన్’ త్రయానికే సలాం చేస్తున్నారా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut). బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకరుకు మించి మరొకరు అనేక హిట్స్ ను అందించారు. అయితే అక్షయ్ కుమార్ లాంటి అగ్రహీరోలు సైతం బాలీవుడ్ ను ప్రభావం చేస్తున్నా.. ‘బాలీవుడ్ అంటే ఖాన్స్’ దే అనే పరిస్థితులున్నాయి.

ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (Pathaan) మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేయడంతో ఖాన్స్ ఈజ్ బ్యాక్ అంటున్నారు మరో వర్గం. ఈ క్రమంలో కంగనా ట్వీట్ చేయడం మరింత ఆసక్తిగా మారింది. “పఠాన్ విజయానికి కారుకులైన షారుఖ్, దీపికాకు అభినందనలు అంటూ పఠాన్ మూవీపై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో వివరంగా చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన ఓ ట్వీట్ (Tweet) ను కూడా ట్యాగ్ చేసింది.

1) హిందూ ముస్లింలు SRKని సమానంగా ప్రేమిస్తారు

2) బేషరమ్ సాంగ్ లాంటి వివాదాలు సినిమాకు ఎలాంటి నష్టం కల్గించలేదు.

3) శృంగార & మంచి సంగీతం సినిమాకు హైలైట్

4) భారతదేశం సూపర్ సెక్యులర్”

అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది కంగనా. ఈ దేశం ఖాన్‌లందరినీ మాత్రమే ప్రేమిస్తుంది. కొన్నిసార్లు ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ఈ ప్రేమ ముస్లిం నటీమణులపై మక్కువ ఉందంటూ అభిప్రాయపడింది. ‘‘భారతీయ ప్రేక్షకులు బాలీవుడ్‌లోని (Bollywood) ముగ్గురు ఖాన్‌లను ఎప్పుడూ ప్రేమిస్తున్నారని, షారుఖ్ ఖాన్ ఇటీవల విడుదలైన ‘పఠాన్’ విజయం అందుకు నిదర్శనం’’ అని క్యాప్షన్ ఇచ్చింది . ప్రస్తుతం కంగనా ట్వీట్ బాలీవుడ్ (Bollywood) వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తోంది.

Also Read: KTR: కేటీఆర్ కు ఆమెరికా ఆహ్వానం.. మంత్రి కీలక ప్రసంగం