TDP : వంగ‌వీటి రాధా టార్గెట్‌గా వాట్స‌ప్‌లో పోస్టులు.. సెంట్ర‌ల్ టీడీపీలో వేడెక్కిన రాజ‌కీయం

బెజ‌వాడ సెంట్ర‌ల్ టీడీపీలో రాజ‌కీయం వేడెక్కింది. టీడీపీ నేత వంగ‌వీటి రాధా టార్గెట్‌గా టీడీపీలో ప్ర‌త్య‌ర్థులు దృష్ప‌చారం

  • Written By:
  • Publish Date - January 20, 2024 / 06:56 PM IST

బెజ‌వాడ సెంట్ర‌ల్ టీడీపీలో రాజ‌కీయం వేడెక్కింది. టీడీపీ నేత వంగ‌వీటి రాధా టార్గెట్‌గా టీడీపీలో ప్ర‌త్య‌ర్థులు దృష్ప‌చారం మొద‌లు పెట్టారు. వాట్స‌ప్‌లో రాధాని టీడీపీ న‌మ్మ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఇవేనంటూ పోస్ట‌ర్ల‌ను టీడీపీ గ్రూపుల్లో పెడుతున్నారు. సెంట్ర‌ల్ సీటు రాధాకి వస్తుంద‌నే భ‌యంతోనే బోండా వ‌ర్గం ఈ కుట్ర చేస్తుంద‌ని రాధా వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు. గ‌త ఐదేళ్లుగా వంగ‌వీటి రాధా టీడీపీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో హాజ‌రుకాలేదంటూ పోస్టుల్లో ఉన్నాయి. పోస్టుల‌పై రాధా వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది. ఇటీవ‌ల రాధా పార్టీ మారుతున్నారంటూ కూడా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. వైసీపీలోకి త్వ‌ర‌లోనే రాధ వెళ్తున్నార‌ని మచిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే ఈ ప్ర‌చారాన్ని రెండు రోజుల క్రితం వంగ‌వీటి రాధ ఖండించారు. తాను పార్టీ మారేది లేద‌ని.. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేత‌లు టీడీపీలోకి రావాల‌ని పిలుపునిచ్చారు. దీంతో ఆయ‌న పార్టీ మార‌డంలేద‌ని స్ప‌ష్ట‌మైంది. అది జ‌రిగిన రెండు రోజుల‌కే మ‌ళ్లీ ఆయ‌న‌పై వాట్స‌ప్‌లో మేసేజ్‌లు స‌ర్క్యూలేట్ అవ్వ‌డంతో వంగ‌వీటి అనుచ‌రులు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల‌ని వంగ‌వీటి రాధ భావిస్తున్నారు.

Also Read:  KTR: రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడు, సీఎంపై కేటీఆర్ ఫైర్