vijayasai reddy: ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవుః విజయసాయి రెడ్డి

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 01:53 PM IST

 

vijayasai reddy: ఈసారి ఎన్నికల్లో వైసీపీ(ysrcp)కి భారీ ఓటమి తప్పదని, మరోసారి గెలవాలనుకుంటున్న జగన్(jagan) ఆశలు నెరవేరబోవని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy)స్పందించారు.

చంద్రబాబు(chandrababu)తో 4 గంటల పాటు సమావేశమైన అనంతరం తాను ఏం మాట్లాడుతున్నాడో ప్రశాంత్ కిశోర్ కే తెలియడంలేదని విమర్శించారు. ఎలాంటి సహేతుకమైన సమాచారం లేకుండా అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్న ప్రశాంత్ కిశోర్ అంచనాలపై ఆధారపడితే అంతే సంగతులు అని వ్యాఖ్యానించారు.

&We’re now on WhatsApp. Click to Join.

ప్రశాంత్ కిశోర్ చెబుతున్నదానికి, సమకాలీన రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభం సమయంలో ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడాయని, ప్రజలకు రక్షణ వలయంలా మారాయని వివరించారు.

కాగా, ఏపీలో వైసీపీ ఓడిపోబోతోందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని… ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఉచిత పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని అన్నారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఏపీలో టీడీపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం తెలిపారు.

read also : PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ