AP: జగన్ కు షాక్…రాజధాని కోసం డబ్బులు ఇవ్వమన్న కేంద్రం..!!

రాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్ కు కేంద్రం షాకిచ్చింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 02:56 PM IST

రాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్ కు కేంద్రం షాకిచ్చింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణం కోసం శివరామ కృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు 29 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ అధికారులు కోరారు. చట్టం ప్రకారం 2500కోట్ల రూపాయలు ఇవ్వాలి…1500కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం స్పష్టతనిస్తుంది. దీనికి సంబంధించిన ఖర్చుల పత్రాలను సమర్పించాలని…ఆ తర్వాతే మిగిలిన వెయ్యి కోట్లు విడుదల చేస్తామని సూచించింది కేంద్ర హోం శాఖ. దీంతో ఏపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం….షీలా బేడీ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపీ అంగీకరించిందని..తెలంగాణ వ్యతిరేకించినట్లు తెలిపారు అధికారులు. షీలా బేడీ కమిటీ సిఫార్సులు తప్పని సరి అమలు చేసేందుకు కేంద్రమే ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఉన్న అవకాశంపై న్యాయ సలహా కోరుతామని కేంద్ర హోం శాఖ తెలిపింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.