Andhra Pradesh : కాకినాడలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!!

  • Written By:
  • Updated On - November 16, 2022 / 10:50 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీని టాటా మ్యాజిక్ ఢీ కొనడంతో ఈ ఘోరం సంభవించింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్న నిత్యం ఏదొక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్ల అజాగ్రత్త, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. వీటినితోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కూడా ఒక కారణమని అధికారులు అంటున్నారు.