Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య […]

Published By: HashtagU Telugu Desk
The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ప్రధానంగా చర్చించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం, తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు జులై మూడో వారంలో ‘మెగా పీటీఎం’ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపైనా చర్చించారు.

పాఠశాల విద్యపై సమీక్ష అనంతరం, ఉన్నత విద్యారంగంపై మంత్రి లోకేశ్ దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్వహించే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ వంటి 12 రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగకూడదని గట్టిగా ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల సెట్ల తేదీలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎప్‌సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని, ముఖ్యంగా డిమాండ్ ఉన్న మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాష్ట్రానికి ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచాలని మంత్రి ఆకాంక్షించారు. థాపర్ ఇనిస్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్ బోర్న్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు చూపుతున్న ఆసక్తిపై చర్చించారు. ముఖ్యంగా, జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని లోకేశ్ ఆదేశించారు.

ఇదే సమయంలో, రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక ‘ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్’ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏపీ యువతకు సైనిక శిక్షణలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె. శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నతవిద్యా కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 16 Jun 2026, 04:59 PM IST