Pawan Kalyan Convoy : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్లోని చివరి వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ క్షేమం
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆ కాన్వాయ్లో లేకపోవడం పెద్ద ఊరటనిచ్చింది. ఆయనను బస చేసిన హోటల్ నుండి పికప్ చేసుకోవడానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అలాగే వాహనాల్లో ఉన్న భద్రతా సిబ్బందికి గానీ, డ్రైవర్లకు గానీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దెబ్బతిన్న వాహనాన్ని పక్కకు తొలగించి, పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
అధికారిక పర్యటనపై ప్రభావం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనలో భాగంగా నిర్వహించే ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026’ వంటి కీలక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చారు. ఈ కాన్వాయ్ ప్రమాదం ఆయన అధికారిక షెడ్యూల్పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆయన యధావిధిగా తన పర్యటనను కొనసాగిస్తున్నారు. అయితే, భద్రతా వాహనాల మధ్య దూరం మరియు అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన ప్రోటోకాల్పై అధికారులు మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు.
