Pawan Kalyan : పిఠాపురంలో పవన్ రోడ్ షో కు ప్రజలు బ్రహ్మ రథం

పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ రోడ్ షో కొనసాగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 11:01 PM IST

శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) లో నిర్వహించిన రోడ్ షో కు ప్రజలు బ్రహ్మ రథంపట్టారు. పిల్లలు , యువకులు , మహిళలు , పెద్దవారు ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు మంగళహారతులు, పుష్పాలు సమర్పించి అభిమానం చాటారు. రోడ్‌ షోలో దారి పొడవునా పవన్‌కు జనసేన అభిమానులు అభివాదం చేస్తూ సందడి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ రోడ్ షో కొనసాగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల భూములకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని , నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని , పిఠాపురం నియోజకవర్గానికి తాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని కాకినాడ ఎస్​ఈజడ్​లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉపాధి కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓటు వేసి గెలిపించాలని పవన్‌ కల్యాణ్ కోరారు.

పవన్ కల్యాణ్​ను చూడగానే పిల్లలు యువత కేరింతలు కొట్టారు. గొల్లప్రోలులో ఇద్దరు బాలురుతో ముచ్చటించారు. ఓ బాలుడు సైన్యంలో చేరతానని, మరో బాలుడు పోలీసు అధికారి అవుతానని పవన్ కల్యాణ్​కు చెప్పారు. ఓ బాలుడు తాను చేయిపైన వేసుకున్న పచ్చబొట్టును పవన్ కల్యాణ్​కు చూపించి అభిమానం చాటుకున్నారు. బాలుడి అభిమానానికి పవన్ కల్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు.

Read Also : Pista Side Effects: పిస్తా పప్పు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు..!