TDP : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.? – నారా భువ‌నేశ్వ‌రి

వైసీపీ పాల‌న‌లో నాలుగ‌న్న‌రేళ్ల‌లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 07:07 AM IST

వైసీపీ పాల‌న‌లో నాలుగ‌న్న‌రేళ్ల‌లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. వేధించడం, ఇబ్బందులు పెట్టడం గొప్ప అనుకుంటున్నారని ఆమె ప్ర‌భుత్వంపై మండిపడ్డారు. నిరాహార దీక్షలు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు కాదు.. ఎండుతున్న పోలాలకు నీళ్లివ్వండిని సూచించారు. ప్రభుత్వ దృష్టి చంద్రబాబు రాసిన లేఖపై కాదని, అభివృద్ధిపై పెట్టాలన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా భువనేశ్వరి ప్రసంగించారు. ‘‘మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్తామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని..కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం నాలుగు దిక్కులయ్యామంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయిందని.. మనవడు దేవాన్ష్ ను చూడక 48 రోజులు అయిందన్నారు. తిరుపతిని ఎన్టీఆర్ ఎలా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుస‌ని.. తి రుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిత్యాన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని భువ‌నేశ్వ‌రి గుర్తు చేశారు. తర్వాత చంద్రబాబునాయుడు కూడా తిరుపతిని అభివృద్ధి చేశారని.. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా చంద్రబాబు అభివృద్ది చేశారని ఆమె తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

భక్తి కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే ప్రశాంతతో ఉంటారని అభివృద్ది చేశారు. దేవాలయాలకు వచ్చే ఆదాయంతో పుణ్యక్షేత్రాలు మరింత అభివృద్ధి చేయవచ్చన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారని తెలిపారు. అనంతపురం జిల్లాను ఆటోమెబైల్ హబ్ గా.. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయన్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని.. మన రాష్ట్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలున్నీ పక్క రాష్ట్రాల యువతకు పోతున్నాయన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉందని.. వాళ్లనూ ఇబ్బందులు పెట్టారన్నారు. ఏపీ నుంచి వెళ్లిన‌ రూ.9,300 కోట్ల పెట్టుబడిని అమ‌ర్‌రాజా కంపెనీ తెలంగాణలో పెట్టింద‌ని గుర్తు చేశారు.తాను కూడా హెరిటేజ్ నడిపిస్తున్నాని.. ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో హెరిటేజ్ ఉందన్నారు. మమ్మల్ని వాళ్లు ఆహ్వానించి పరిశ్రమకు ఏం కావాలో అడుగుతారని.. అన్నీ ఇచ్చి పెట్టుబడుల్లో ముందుకు తీసుకెళ్తారన్నారు. ఏనాడూ మమ్మల్ని భయపెట్టలేదు. చంద్రబాబు ఉమ్మడి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు ఐఎస్బీ తీసుకొచ్చారని గుర్తు చేశారు.

Also Read:  Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్.. నా భ‌ర్త లేకుండా తొలిసారి..?