CBI : వివేకా హ‌త్య కేసులో నేడు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి వైఎస్ఆర్సీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు (శ‌నివారం) హైదరాబాద్‌లోని

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 08:23 AM IST

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి వైఎస్ఆర్సీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు (శ‌నివారం) హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎదుట హాజ‌రుకానున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఎంపీకి నోటీసులు జారీ చేస్తూ హైదరాబాద్ జోన్‌కు చెందిన సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు జనవరి 24న తమ ఎదుట హాజరుకావాలన్నారు. అయితే తనకు జనవరి 23న నోటీసు అందినందున కొంత సమయం ఇవ్వాలని తాను పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి సమాచారం అందించారు. అవినాష్ రెడ్డి అభ్యర్థన మేరకు జనవరి 28న హైదరాబాద్ కార్యాలయంలో విచార‌ణ‌కు హాజరుకావాలని కోరుతూ ఏజెన్సీ మళ్లీ నోటీసు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో అవినాష్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు (శనివారం) సీబీఐ ముందు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు హాజరుకానున్నారు.