Site icon HashtagU Telugu

Duvvada Srinivas : రాడ్ పట్టుకుని భార్యపై దాడి చేసేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ..

Duvvada Wife

Duvvada Wife

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ (YCP MLC Duvvada Srinivas) కుటుంబంలో మొదలైన గొడవలు..ఇప్పుడు రోడ్ మీదకు వచ్చాయి. గత కొద్దీ నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ అతడి భార్య కు మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ వయసు 60 ఏళ్లు..ఈ వయసులో కుటుంబం తో కలిసి ఉండకుండా మాధురి తో అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని కూతుళ్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టెక్కలి జాతీయ రహదారిపై నూతనంగా శ్రీనివాస్ ఓ ఇంటిని నిర్మించుకున్నారు. గురువారం ఆ ఇంటికి వెళ్లిన ఇద్దరు కుమార్తెలను లోపలికి అనుమతించక పోవడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి గం.2 వరకు గేటు వెలుపలే కారులో కూర్చుని..తిరిగి వెళ్లిపోయారు. తన తండ్రిని కలుస్తామంటే ఎలా అడ్డుకుంటారంటూ మాధురిపై దువ్వాడ కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం నిన్న అర్ధరాత్రి మరోసారి భార్య వాణి (YCP MLC Duvvada Srinivas Wife Vani ), కుమార్తెలు కలిసి దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఆయన బయటికి రావాల్సిందేనంటూ అక్కడే బైఠాయించారు. దీంతో చాలాసేపటి తర్వాత బయటికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ భార్యా పిల్లలపై రెచ్చిపోయారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగారు. అక్కడే ఉన్న రాడ్ తీసుకుని వారిపైకి దాడి చేసేందుకు వెళ్లగా..పోలీసులు అడ్డుకున్నారు. నన్ను రోడ్డుకి ఈడుస్తారా అంటూ శ్రీనివాస్ నానా రచ్చ చేసాడు. వైసీపీ లో ఇటువంటి నాయకులను జగన్ పెంచి పోషిస్తున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నేళ్లుగానో ఓపిక పట్టామని, గతంలో అప్పటి సీఎం జగన్ , వైసీపీ అధిష్టానానికి పరిస్థితి వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వైఖరి వలన కేవలం తాము మాత్రమే నష్ట పోవడం లేదని, పార్టీ, కార్యకర్తలు అంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నారని, చాలా మంది జీవితాలను నాశనం చేసిన ఆమె ఉచ్చులో తన భర్త చిక్కుకున్నారని భార్య ఆరోపించారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్