Site icon HashtagU Telugu

వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గుడ్ బై..?

Vasantha

Vasantha

వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్నారు. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి నాయతకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా మరో వైసీపీ నేత కూడా బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు విన్పిస్తున్నాయి.

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) అతి త్వరలో వైసీపీ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దెందులూరులో జరిగే ‘సిద్ధం’ సభకు ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా వసంత టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత పేరుతో చంద్రబాబు సర్వే నిర్వహించినట్లు టాక్. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైల‌వ‌రం. ఇది టీడీపీకి కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు ఈయ‌న కూడా టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరిన నాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావ‌న పెరిగిందని గత కొద్దీ రోజులుగా వసంత కృష్ణ ప్రసాద్ చెపుతూ వస్తున్నారు. జగన్ “సంక్షేమం అమ‌లు చేస్తున్నారు బాగానే ఉంది. కానీ, ప్ర‌జ‌లు అభివృద్ధిని కోరుకుంటున్నారు. దీనికి మా ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ప్ర‌జ‌ల అభిరుచి మేర‌కు వారు కోరుకున్న‌ది చేయ‌డం లేదు. అందుకే ప్ర‌జ‌లు కొంత ఆలోచ‌న‌లో ప‌డ్డారు” అని వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి.. ఆయ‌న పార్టీకి గుడ్ బై చెబుతార‌ని.. కొన్నాళ్లుగా ప్ర‌చారంలోనే ఉంది. ఇక‌, ఇప్పుడు అది ద్రుఢ ప‌డింది.

Read Also : Minister Roja : శ్రీవారి సన్నిధానంలో మంత్రి రోజా కు షాక్ ..