CBN : టీడీపీ పార్టీ కార్య‌క‌ర్త‌లే చంద్ర‌బాబును త‌రిమివేయాల‌ని లక్ష్మీ పార్వతి పిలుపు

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 02:16 PM IST

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ నేతలు తమ దూకుడును పెంచారు. వరుస పెట్టి నేతలు బయటకు వస్తూ టిడిపి – జనసేన కూటమి ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నెల చివరికల్లా పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన రానున్న తరుణంలో తమ నోటికి పనిచెప్పారు ఆ పార్టీ నేతలు , శ్రేణులు. ముఖ్యంగా చంద్రబాబు ను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈసారి కాస్త గాలి టిడిపి వైపు వీస్తుండడం తో..ఆ గాలిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తాజాగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ..టీడీపీ పార్టీ నుంచి ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే చంద్ర‌బాబును త‌రిమివేయాల‌ని లక్ష్మీ పార్వతి పిలుపునిచ్చారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ. 6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయటం మనం చూశామని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టుపెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? అని లక్ష్మీ పార్వతి నిలదీశారు. అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు వలన రాష్ట్ర ప్రజలకు ఏ ప్రయోజనమైనా చేకూరిందా?. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది?. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు. చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహంచాలి. చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలోనూ ఉండకూడదని ఎన్టీఆర్ అన్నారు. టీడీపీలో నుండి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి అని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇక చంద్రబాబు ఢిల్లీ లో బిజెపి నేతలను కలవడం ఫై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడ‌ని , జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఒంటరిగా ఎదుర్కోలేక పవన్, బీజేపీని చంద్ర‌బాబు తెచ్చుకోవాలని చూస్తున్నాడని నాని పేర్కొన్నారు. బీజేపీ, చంద్రబాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా..? సిగ్గు.. ఎగ్గులేకుండా జనం మధ్యకు వస్తారా..? సమాధానం చెప్పాల‌ని ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు.

2014లో ఏపీ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అవసరమన్నాడు. బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగాడు. నాలుగేళ్లు కాపురం చేసి చివరి ఆరునెలల్లో బీజేపీపై చంద్రబాబు బూతులు తిట్టాడు. ప్రధాని మోదీకి భార్యలేదన్నాడు. కుటుంబం కూడా లేనోడు నాతో పోటీనా అన్నాడు. ఈడీతో బెదిరిస్తావా.. ఏం చేస్తావో చేసుకో అన్నాడు. బీజేపీతో ఎందుకు కలిసి పోటీచేయాలో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. మాకు సిగ్గు లేదు రాజకీయాలు కావాలి అని ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తారా అని ఆయన అన్నారు.

Read Also : CM Revanth : కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ తాపత్రయ పడ్డారు – సీఎం రేవంత్