Jagan fire : వారాహి..అదో లారీ, ప‌వ‌న్ గాలితీసిన జ‌గ‌న్

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కురుపాం కేంద్రంగా ప‌వ‌న్ మీద రాజ‌కీయ( Jagan fire)టార్గెట్ మొద‌లు పెట్టారు. వారాహి వాహ‌నాన్ని లారీ కింద పోల్చేశారు.

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 03:45 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కురుపాం కేంద్రంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ మీద రాజ‌కీయ( Jagan fire)టార్గెట్ మొద‌లు పెట్టారు. యాత్ర కోసం పాపుల‌ర్ గా ప్ర‌చారం చేసిన వారాహి వాహ‌నాన్ని లారీ కింద పోల్చేశారు. ఆ లారీ వేసుకుని వ‌చ్చే ద‌త్త‌పుత్రుడు ప్ర‌తి నాలుగేళ్ల‌కు ఒక‌సారి భార్య‌ను మార్చేస్తాడ‌ని దుయ్య‌బట్టారు. ఊగిపోతూ, నిల‌క‌డ‌లేని మాట‌లు మాట్లాడ‌తాడ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న మాదిరిగా తాను ఉండ‌లేన‌ని సెటైర్లు వేశారు జ‌గ‌న్.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కురుపాం కేంద్రంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ మీద రాజ‌కీయ టార్గెట్( Jagan fire)

అమ్మఒడి నిధుల‌ను కురుపాం వేదిక‌గా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం విడుద‌ల చేశారు. నేరుగా ఖాతాల్లోకి నిధులు జ‌మ అయ్యేలా కంప్యూట‌ర్ బ‌ట‌న నొక్కారు. ఆ నొక్కే బ‌ట‌న్ మీద ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సెటైర్లు వేస్తూ 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను చ‌ద‌వి వినిపించారు. ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద గ‌త ప‌ది రోజులుగా ప‌వ‌న్ విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌తిగా మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు త‌దిత‌రులు మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇప్పుడు నేరుగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ( Jagan fire) రంగంలోకి దిగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉప‌యోగిస్తోన్న వారాహి వాహ‌నాన్ని ఒక లారీ కింది పోల్చారు.

ద‌త్త‌పుత్రుడు ప్ర‌తి నాలుగేళ్ల‌కు ఒక‌సారి భార్య‌ను మార్చేస్తాడ‌ని

తొలి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడిగా ప్ర‌చారం చేస్తున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. జ‌న‌సేన పార్టీని చంద్ర‌బాబు కోసం పెట్టార‌ని విమ‌ర్శిస్తున్నారు. అంతేకాదు, దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ ప్ర‌చారం చేస్తూ వాళ్ల‌తో పాటు ద‌త్త‌పుత్రుడు అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు వేదిక‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పెళ్లిళ్ల వ్య‌వ‌హారాన్ని నేరు ప్ర‌స్తావించ‌డంతో రాజ‌కీయ వేడి పెరిగింది. పెళ్లి అనే బంధాన్ని రోడ్డు మీద‌కు తీసుకురాలేన‌ని చెబుతూ, ఆ విధంగా చేయ‌డం ప‌వ‌న్ కు మాత్ర‌మే పేటెంట్ అంటూ ఘాటుగా ( Jagan fire)విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం బ‌హుశా ఇదే తొలిసారి. ఆ విధంగా తాను చేయ‌లేన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంప్ర‌దాయాల గురించి మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

వారాహి వాహ‌నాన్ని లారీ కింద పోల్చేశారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవిత‌లోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూరారు. ఆయ‌న వాడుతోన్న వాహ‌నాన్ని కూడా వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. యాత్ర కోసం ప‌వ‌న్ వాడుతోన్న వాహ‌నాన్ని వైసీపీలోని కొందుకు కుక్క‌ల బండి అంటే ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లారీ ( Jagan fire) అంటూ పోల్చారు. ఆ వాహ‌నం క‌ల‌ర్ మీద కూడా ప‌లు సంద‌ర్భాల్లో వైసీపీ విమ‌ర్శ‌లు చేసింది. వారాహి గా ఆ వాహ‌నం పేరును పెట్ట‌డాన్ని కూడా అభ్యంత‌ర పెట్టింది. ప‌విత్ర‌మైన హిందూ దేవ‌త పేరును వాహ‌నానికి ఎలా పెడ‌తార‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌ర్ ఫుల్ దేవ‌త‌గా ఉన్న వారాహి పేరు మీద ఉన్న వాహ‌నం ఎక్క‌డానికి ఎంత ధైర్యం నిల‌దీశారు. ఆ దేవ‌త క్ష‌మించ‌ద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మంత్రి అంబ‌టి రాంబాబు శాపం పెట్టారు.

Also Read : Jagan on Pawan: నలుగురిని పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చుకోలేం: పవన్ పై జగన్ ఫైర్!

ఆ వాహ‌నం మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ గోదావ‌రి జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఆ సంద‌ర్భంగా ఊగిపోతూ, ప‌లు ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యేల మీద గుప్పిస్తున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద విరుచుకుప‌డుతున్నారు. రౌడీలు, గుండాలు, క‌బ్జాకోరులు, సైకోలు రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. సీఎం ప‌ద‌వి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని దింప‌డ‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ చెబుతున్నారు. జైలుకు వెళ్లొచ్చిన ఒక నేర‌గాడు పాలిస్తుంటే, చూస్తూ ఊరుకోకూడ‌ద‌ని ప్ర‌జ‌ల‌కు హిత‌వు ప‌లుకుతున్నారు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం ఘాటుగా ( Jagan fire)ప‌వ‌న్ మీద‌, ఆయ‌న వాడుతోన్న వాహ‌నం మీద సెటైర్లు వేస్తూ గాలితీసేలా మాట్లాడారు.

Also Read : Pawan Kalyan: ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా? తూర్పు కాపుల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..