Road Accidents: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

విశాఖపట్నంలోని వెంకోజిపాలెంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ట్రాలీ ఆటో డ్రైవర్ ఘటన స్థలం నుండి పారిపోయాడు.

  • Written By:
  • Updated On - February 10, 2023 / 09:56 AM IST

విశాఖపట్నంలోని వెంకోజిపాలెంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ట్రాలీ ఆటో డ్రైవర్ ఘటన స్థలం నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న ట్రాలీ ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఏపీలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా మణుగూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వోల్వో బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను  నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, శీనయ్యలుగా గుర్తించారు.