AP CM : ఏపీ స్టూడెంట్స్ కు సీఎం జగన్ గుడ్ న్యూస్…!!

ఏపీలోని స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. విద్యార్థుల కోసం ట్యాబ్ లు కొనుగోలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 04:33 PM IST

ఏపీలోని స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. విద్యార్థుల కోసం ట్యాబ్ లు కొనుగోలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వనున్న సర్కార్…బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. విద్యాకానుకపై సోమవారం ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ లో పాఠశాలలు పున: ప్రారంభం అయ్యేనాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువూలూ అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. విద్యాకానుక ప్రతివిద్యార్థికి అందాలని ఆదేశించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలు విద్యాకానుక ప్రారంభమయ్యే రోజే తల్లుల అకౌంట్లో వేయాలని అధికారులకు చెప్పారు. ఇక గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత ఇవన్నీ కూడా విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ .