Atchannaidu : ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను‌ సర్వనాశనం చేసారు

  • Written By:
  • Updated On - February 26, 2024 / 06:57 PM IST

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ (TDP) నిర్వహించిన ‘రా కదలి రా’ సభ ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు (Atchannaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి ని ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. ఒక కులం ఒక మతం కాదు ఐదుకోట్ల మంది వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను‌ సర్వనాశనం చేసారని, 160 స్దానాలలో అధికారం చేపట్టబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేన (Janasena)- టీడీపీ కలిసిన రోజే జగన్ ప్యాంట్ తడిసిపొయిందంటూ ఆయన సెటైర్లు వేశారు. సీట్లు ప్రకటించిన రోజే తట్టా బుట్టా సర్దుకున్నారని, రాష్ర్టంలో త్యాగాలు చెయాల్సిన అవసరం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ కు నేను సెల్యూట్ కొడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ (YSRCP) విముక్త అంధ్రప్రదేశ్ చూడాలని పొత్తు పొట్టుకున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన అన్నారు. సీట్లు సర్దుబాటులో తగాదాలు ఉన్నాయని మాట్లాడుతున్నారని.. అవన్నీ అవస్తవాలని ఆయన పేర్కొన్నారు. జగన్ రెడ్డి నెల రోజులకు పైగా జాబితాలపై కసరత్తులు చేసినప్పటికీ అధికారికంగా ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేకపోయాడు. జగనరెడ్డి నియ మించిన సమన్వయకర్తల్లో కూడా ఎవరు ఉంటారో.. ఎవరు ఊడతారో తెలియని అభద్రతాభావంలో ఉన్నా రు. ఎవరు ఉంటారో, ఎవరు ఊడుతారోనని ఎమ్మెల్యే లకు ఎంపీ సీట్లు ఇస్తానంటే వద్దంటున్నారు. ఎంపీ లకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే కాదంటున్నారు. వైకా పాకు అభ్యర్థులు దొరక్క చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఒంగోలులో పోటీకి దింపుతున్నారు, మరొకాయనను నెల్లూరు నుంచి నరసారావుపేటకు తెచ్చారన్నారు.
Read Also : TDP-JSP : ఆ స్థానాల్లో టీడీపీ-జనసేన క్లీన్‌ స్వీప్‌..?