Bengaluru: భార్య పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య

బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది.

Bengaluru: బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరార్జున విజయ్‌, తన భార్య (హేమావతి) పిల్లలతో కలిసి బెంగుళూరులో ఉంటున్నారు. ఆరేళ్లక్రితమే వీరికి వివాహం జరిగింది. అయితే రెండు మూడు రోజులుగా వీరి అపార్ట్మెంట్ నుంచి రాకపోకలు జరగలేదు. ఈ రోజు వారి అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. అయితే ఈ ఘటన జూలై 31న జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణుల బృందం వచ్చి విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భార్య వయసు 29 సంవత్సరాలు, సంవత్సరంన్నర పాప, మరోపాపకు 8 నెలలు.

Also Read: Aloo Batani Pulao: ఎంతో స్పైసీగా ఉండే ఆలు బఠాణి పులావ్.. తయారీ విధానం?