AP Footballer Killed: మద్యం మత్తులో ఫుట్ బాల్ ప్లేయర్.. 16 పోట్లు పొడిచి హత్య!!

విజయవాడలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఆకాశ్(23) అనే ఫుట్ బాల్ ప్లేయర్ మద్యం మత్తులో ఉండగా హత్యకు గురయ్యాడు.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 07:27 PM IST

విజయవాడలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఆకాశ్(23) అనే ఫుట్ బాల్ ప్లేయర్ మద్యం మత్తులో ఉండగా హత్యకు గురయ్యాడు. 10 మంది దుండగులు కలిసి విచక్షణా రహితంగా 16 కత్తిపోట్లు పొడవడంతో అక్కడికక్కడే ఆకాశ్ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడి మృతదేహాన్నీ శవపరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

టోనీ అనుచరులవి రెండు గ్యాంగ్ లు ఉన్నాయి. ఈ రెండు గ్యాంగ్ల సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం మద్యం తాగేందుకు సమీపంలోని లిక్కర్ షాపుకు వెళ్లారు. ఈ రెండు గ్యాంగ్ లలో ఒకదానిలో ఆకాశ్ సభ్యుడిగా ఉన్నాడు. మద్యం తాగుతుండగా రెండు గ్యాంగ్ల మధ్య మాటకు మాట పెరిగింది. ఈక్రమంలో ఆకాశ్ మరో గ్యాంగ్ లోని ఒక వ్యక్తిని కొట్టాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆకాశ్ ను అతడి గ్యాంగ్ సభ్యుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికెళ్లాక మద్యం మత్తులో ఆకాశ్ నిద్రలోకి జారుకున్నాడు. అతడి చుట్టూ ముగ్గురు తోటి గ్యాంగ్ సభ్యులు రక్షణ గా కూర్చొని ఉన్నారు. ఇంతలోనే అవతలి గ్యాంగ్ కు చెందిన 10 మంది అక్కడికి చేరుకున్నారు.

వాళ్ళను చూడగానే ఆకాశ్ వద్ద కూర్చున్న ఇద్దరు మిత్రులు పారిపోయారు.ఆకాశ్ మరో స్నేహితుడిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత.. నిద్రలో ఉన్న ఆకాశ్ ను కత్తులు, పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. దీనికి సంబంధించి పటమట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. హంతకుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.