Zombies: కిమ్ సైన్యంలో ‘జాంబీలు’.. వైరల్ అవుతున్న ఫొటోలు!

ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించారు .

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించారు . ఈ పరేడ్‌లో శక్తిమంతమైన ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏంటో తెలిసేలా చేశారు. అయితే సైనిక పరేడ్‌లో పాల్గొన్న ఓ యూనిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జాంబీ (Zombies) యూనిట్.

కిమ్ సైనిక పరేడ్‌లో జాంబో యూనిట్‌ను చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. జాంబీల్లా (Zombies) కన్పిస్తున్న ఈ సైనికుల పరేడ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మొహానికి రంగులు వేసుకుని ఒళ్లంతా పచ్చగడ్డి కప్పుకున్నట్లుగా కన్పించిన సైనిక వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ పరేడ్‌లో క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ల కంటే జాంబీ యూనిట్‌ను చూసినప్పుడే తాను భయపడ్డాని అతను చెప్పుకొచ్చాడు.

Also Read:  Tejaswi Yadav: తేజస్వీ యాదవ్‌ కు నిరుద్యోగ యువతి లేఖ.. మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. మరి నేను!