Russia Vs Ukraine : రష్యా ఆగ్రహంతో ఊగిపోయింది. తమ దేశంపైకి ఆరు లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించిన ఉక్రెయిన్పై ఏకంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)తో దాడి చేసింది. ఉక్రెయిన్లోని డెనిపర్ నగరంపై రష్యాకు చెందిన ఐసీబీఎం మిస్సైల్ పడి భారీ విధ్వంసం జరిగింది. పేలుడు శబ్దాల తీవ్రత అత్యధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారు ? ఆస్తి నష్టం ఎంతమేర జరిగింది ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా ప్రయోగించిన ఐసీబీఎం మిస్సైల్ ప్రత్యేకత ఏమిటంటే.. న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లే కెపాసిటీ కూడా దానికి ఉంది. ఐసీబీఎం మిస్సైల్తో పాటు ఎక్స్-47ఎం2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ఉక్రెయిన్పైకి రష్యా ప్రయోగించింది. ఈవివరాలను ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. ఈ దాడిపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. ఇలాంటి అంశాలపై చెప్పేందుకు ఏమీ ఉండదని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్(Russia Vs Ukraine) స్పష్టం చేశారు. రష్యా సైనికులను ఈ ప్రశ్న అడగాలని ఆయన మీడియాకు సూచించారు. ఇవాళ ఉక్రెయిన్పై ఐసీబీఎం మిస్సైళ్లతో రష్యా దాడి చేయనుందనే సమాచారం నిఘా వర్గాల ద్వారా అమెరికాకు ముందే అందినట్లు తెలుస్తోంది. అందుకే బుధవారం రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని తమ ఎంబసీని అమెరికా ఖాళీ చేసింది.
Also Read :MLC Kavitha : ‘‘అదానీకొక న్యాయం.. ఆడబిడ్డకొక న్యాయమా ?’’.. ప్రధాని మోడీకి కవిత ప్రశ్న
- రష్యా ఇవాళ ప్రయోగించిన ఐసీబీఎం మిస్సైల్ గరిష్ఠంగా 6వేల కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించగలదు.
- భూగర్భంలో ఏర్పాటు చేసిన సిలోస్ నుంచి, లారీ లాంటి భారీ వాహనం నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు.
- 1957లో తొలిసారిగా సోవియట్ యూనియన్ దీన్ని తయారు చేసింది.
- ఉక్రెయిన్లో విదేశీ ఆయుధాలను నిల్వ చేసిన గోదాంలను లక్ష్యంగా చేసుకొని రానున్న రోజుల్లో ఖండాంతర మిస్సైళ్లను రష్యా ప్రయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
- దీంతోపాటు పోలండ్లో ఉన్న నాటో సైనిక స్థావరాన్ని టార్గెట్గా చేసుకొని దాడికి పుతిన్ ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. యుద్ధ రంగంలోకి నాటో కూటమి కూడా ఎంట్రీ ఇస్తుంది.