ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

తుర్కియేలో జరిగిన 'అంటాల్య డిప్లొమసీ ఫోరమ్' సందర్భంగా ఈ కీలక సమావేశాలు జరిగాయి. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురువారం టెహ్రాన్‌లో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బేకర్ గాలిబాఫ్‌తో సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Peace Talks In Islamabad

Peace Talks In Islamabad

Peace Talks In Islamabad: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం మధ్య దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా ఇరాన్- అమెరికా మధ్య కొత్త రౌండ్ చర్చలు సోమవారం (20 ఏప్రిల్ 2026) పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం.. రెండు దేశాల ప్రతినిధి బృందాలు ఆదివారం (ఏప్రిల్ 19, 2026) ఇస్లామాబాద్‌కు చేరుకోవచ్చు.

అల్ జజీరా నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతంలో యుద్ధాన్ని ఆపడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విషయంలో పాకిస్థాన్ పోషిస్తున్న పాత్రను ఖతార్, తుర్కియే అభినందించాయి.

Also Read: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో భారీ మార్పు!

ఆసిమ్ మునీర్ ఇరాన్ పర్యటన

తుర్కియేలో జరిగిన ‘అంటాల్య డిప్లొమసీ ఫోరమ్’ సందర్భంగా ఈ కీలక సమావేశాలు జరిగాయి. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురువారం టెహ్రాన్‌లో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బేకర్ గాలిబాఫ్‌తో సమావేశమయ్యారు. అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భేటీని చూస్తున్నారు. ఆసిమ్ మునీర్ బుధవారం టెహ్రాన్ చేరుకోగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆయనకు స్వాగతం పలికారు. గతంలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనందున.. రెండో రౌండ్ చర్చల కోసం అనుకూల వాతావరణాన్ని సిద్ధం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో చర్చలు

ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు ఒక ముఖ్యమైన ప్రయత్నం. అమెరికా- ఇరాన్ మధ్య 39 రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించడమే దీని లక్ష్యం. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ చర్చలు చారిత్రాత్మకమైనప్పటికీ అప్పుడు ఎలాంటి స్పష్టమైన ఫలితం రాలేదు.

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మధ్య 10 రోజుల కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుతో మాట్లాడిన తర్వాత ఇరుపక్షాలు ఈ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ వివరించారు. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

  Last Updated: 18 Apr 2026, 11:05 AM IST