More than 600 killed: నైజీరియాలో భారీ వరదలు.. 600 మందికి పైగా మృతి..!

నైజీరియాలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సము సృష్టిస్తున్నాయి. పలు పట్టణాలు, గ్రామాలను వరదలు ముంచెత్తడంతో 600 మందికి పైగా మృతి చెందారు. 13 లక్షల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించినట్లు అక్కడి గవర్నమెంట్ పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
Nigeria Floods 17 1665981280476 1665981280476 1665981312206 1665981312206 (1)

Nigeria Floods 17 1665981280476 1665981280476 1665981312206 1665981312206 (1)

నైజీరియాలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సము సృష్టిస్తున్నాయి. పలు పట్టణాలు, గ్రామాలను వరదలు ముంచెత్తడంతో 600 మందికి పైగా మృతి చెందారు. 13 లక్షల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించినట్లు అక్కడి గవర్నమెంట్ పేర్కొంది. సుమారు 2. 72 లక్షల ఎకరాలలో పంట నష్టపోయింది. సరిగ్గా 10 ఏళ్ళ క్రితం ఇదే విధంగా భారీ వరదలు రావటంతో 360 మంది చనిపోయారు.

నైజీరియాలో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 600 మంది దాటిందని ఆ దేశ హ్యుమానిటేరియన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. ముఖ్యంగా తడి వర్షాకాలం తర్వాత దేశంలోని దక్షిణ ప్రాంతాలలో వ్యాపించిన వరదల వల్ల 2 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 200,000 కంటే ఎక్కువ గృహాలు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ నైజర్, బెన్యూ నదుల ప్రవాహాల వెంబడి ఉన్న రాష్ట్రాలకు విపత్తు వరదల గురించి హెచ్చరించింది. నైజీరియాలో మూడు రిజర్వాయర్‌లు పొంగిపొర్లుతాయని భావిస్తున్నారు. పొరుగున ఉన్న కామెరూన్‌లోని డ్యామ్ నుండి అదనపు నీటిని విడుదల చేయడం వరదలకు కారణమైందని NEMA తెలిపింది. నైజీరియాలోని అనేక ప్రాంతాలు వార్షిక వరదలకు గురవుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వరదలు 2012లో సంభవించిన పెద్ద వరదల కంటే తీవ్రంగా ఉన్నాయని కోగిలోని రెడ్‌క్రాస్ అధికారి గతవారం తెలిపారు. నైజీరియా మానవతా వ్యవహారాల మంత్రి సాదియా ఉమర్ ఫరూఖ్ మరింత వరదలు వచ్చే అవకాశం ఉందని, తదనుగుణంగా ప్రాంతీయ ప్రభుత్వాలు సిద్ధం కావాలని కోరారు.

 

 

  Last Updated: 17 Oct 2022, 04:51 PM IST