Rhino Hit Truck: ట్రక్కును ఢీకొన్న ఖడ్గమృగం.. సీఎం ట్వీట్ వైరల్!

అటవీ శాఖాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కారణం వణ్య ప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 10, 2022 / 12:52 PM IST

అటవీ శాఖాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కారణం వణ్య ప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకు ఉదాహరణే అస్సాం ఘటన. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. హల్దిబారీలో జరిగిన దురదృష్టకర సంఘటనగా  సీఎం పేర్కొన్నారు.

ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడిందని, ఈ జంతువును ఢీ కొట్టిన వాహనానికి జరిమానా విధించినట్లు సీఎం తెలిపారు. కజిరంగా వద్ద వన్య ప్రాణులను సంరక్షించాలనే సంకల్పంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా 32 కిమీ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించడంపై పని చేస్తున్న విషయం తెలిసిందే.