అటవీ శాఖాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కారణం వణ్య ప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకు ఉదాహరణే అస్సాం ఘటన. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. హల్దిబారీలో జరిగిన దురదృష్టకర సంఘటనగా సీఎం పేర్కొన్నారు.
ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడిందని, ఈ జంతువును ఢీ కొట్టిన వాహనానికి జరిమానా విధించినట్లు సీఎం తెలిపారు. కజిరంగా వద్ద వన్య ప్రాణులను సంరక్షించాలనే సంకల్పంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా 32 కిమీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడంపై పని చేస్తున్న విషయం తెలిసిందే.
♦అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
♦ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
♦హల్దిబారీలో జరిగిన దురదృష్టకర సంఘటనగా సీఎం పేర్కొన్నారు. pic.twitter.com/Q5ekJPwLWg— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 9, 2022