Lok Sabha Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు లోక్సభ ఎన్నికల ఓట్ట లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కేరళలో ఎల్డిఎఫ్ లీడింగ్ లో ఉంది. కేరళలో ఎల్డిఎఫ్ కు 9 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుంది. యూడిఎఫ్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తిరువనంతపురంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రాజీవ్ చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. కేరళలోని ముఖ్యమైన నియోజకవర్గాలలో తిరువనంతపురం, ఎర్నాకులం, పతనంతిట్ట, త్రిసూర్ మరియు కాసరగోడ్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు తరచుగా విస్తృత రాజకీయ ధోరణులను ప్రతిబింబిస్తూ ఘంటాపథంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ ఉండటం వీరి ప్రత్యేకత.