Samosa Contest: ఈ సమోసాలు అర్ధగంటలో తింటే రూ.50 వేలు మీ సొంతం.. ఈ పోటీ ఎక్కడంటే?

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆహార ప్రియుల కోసం పలు హోటల్స్ వారు ఛాలెంజ్ లు విసురుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 9, 2022 / 07:30 AM IST

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆహార ప్రియుల కోసం పలు హోటల్స్ వారు ఛాలెంజ్ లు విసురుతున్నారు. బిర్యానీ తింటే లక్ష రూపాయలు మీ సొంతం అని, అలాగే మరొక పెద్ద బిర్యాని తింటే బుల్లెట్ బండి మీ సొంతం అంటూ ఇలా రకరకాలుగా వ్యాపారం చేసేవాళ్లు ఆహార ప్రియుల కోసం అనేక రకాలుగా ఛాలెంజ్ లను పెడుతున్నారు. కాగా ఇప్పటివరకు ఇలాంటి చాలెంజ్లో చాలామంది పాల్గొన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ఆ చాలెంజ్ లో గెలవలేకపోయారు. తాజాగా అలాగే ఒక వ్యాపారి ఆహార ప్రియుల కోసం ఒక ఛాలెంజ్ ను విసిరాడు. అతను తయారు చేసే సమోసాను తింటే రూ.51వేలు గెలుచుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు.

అయితే ఈ ఛాలెంజ్ గురించి తెలుసుకుని చాలామంది ఆ సమోసా ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. అయితే అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దని సదరు వ్యాపారీ భరోసా ఇస్తున్నాడు. టేస్ట్‌లో అలాగే క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా సమోసాను తయారు చేసి ఇస్తామని చెబుతున్నాడు. అయితే ఇందులో అసలైన ట్విస్ట్ ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుభమ్ కౌశల్ అనే వ్యక్తి గత కొన్నిల్లుగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో కౌశల్ పేరుతో స్వీట్ షాప్ ను నడుపుతున్నాడు.

కౌశల్ ఫుడ్ లవర్స్‌కు సవాలు విసిరాడు. తాను తయారు చేసే బాహుపలి సమోసాను తినే దమ్ముందా అంటూ సవాల్ విసురుతున్నాడు. దాదాపుగా 8 కేజీల భారీ సమోను కేవలం 30 నిమిషాల్లో తినగలిగితే 51వేలు సొంతం చేసుకోవచ్చని ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చిన కౌశల్ మాట్లాడుతూ..బాహుబలి సమోసాను తయారు చేయడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుందని, ఆ సమోసాను తయారు చేయడం కోసం రూ.1100ఖర్చు అవుతుందని తెలిపాడు. అలాగే గతంలో 4 కేజీల సమోసాను తయారు చేసినట్టు వెల్లడించాడు. 10 కేజీల సమోను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నాడు. కాగా తాను తయారు చేసే సమోసాలో బంగాల దుంపలు, డ్రై ఫ్రూట్స్, బఠాణీని ఉపయోగిస్తున్నట్టు వెల్లడించాడు. మరి ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్ లో చాలామంది పాల్గొన్నప్పటికీ ఎవరూ కూడా ఆ ఛాలెంజ్ ను గెలవలేకపోయారట.