CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీధర్బాబుతో కలిసి మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను ప్రారంభించిన ఆయన, తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధిలో ముందు వరుసలో ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్కి దేశంలో పోల్చదగిన నగరం లేదు. మన నగరం ఇప్పుడు అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోంది. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్-2047 ప్రణాళికను రూపొందించాం. ఇది కేవలం ప్రణాళిక మాత్రమే కాకుండా, పట్టుదలతో అమలు చేసే చర్యల సమాహారం అని పేర్కొన్నారు.
Read Also: Netanyahu : గాజాలో ‘హమస్థాన్’ ఏర్పాటు కానివ్వబోం
నగర అభివృద్ధి కోసం దేశవాళీ, విదేశీ కన్సల్టెంట్లను రంగంలోకి దింపినట్టు వెల్లడించారు. పెట్టుబడిదారులకు పూర్తి భద్రత కల్పిస్తూ, వారి వ్యాపారాలు లాభదాయకంగా ఉండేలా ప్రభుత్వంగా సహకరిస్తున్నామని తెలిపారు. ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు మద్దతు ఇస్తాం. పారిశ్రామికవేత్తలకు సౌకర్యాలు, పారదర్శకత, వేగవంతమైన అనుమతులతో మద్దతు అందిస్తున్నాం అని అన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..తెలంగాణలో తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత సంవత్సరంలోనే 9 శాతం వృద్ధిరేటును సాధించాం. రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పాలసీ’ మరియు ‘ఎంఎస్ఎంఈ పాలసీ-2025’ను అమలు చేసింది. ఇవి పరిశ్రమల ఏర్పాటుకు బలమైన బూనుదారులవుతున్నాయి అని వివరించారు.
అదేవిధంగా, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే 4,200 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 98 శాతం దరఖాస్తులను కేవలం 15 రోజుల్లో పరిష్కరించామని చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ..తెలంగాణలో పెట్టుబడి పెట్టడంపై తమకున్న నమ్మకమే ఈ మేగా ప్రాజెక్టుకు ప్రేరణగా మారిందని పేర్కొన్నారు. పరిశ్రమ ప్రారంభం ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పించబడతాయని, తెలంగాణ తరహాలో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి ప్రాజెక్టులు పెద్ద దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ చూస్తే, తెలంగాణ ఇప్పుడు కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కాకుండా, దేశానికి మార్గదర్శకంగా మారుతుందన్న అంచనాలను ఈ కార్యక్రమం ధృవీకరించింది.
Read Also: Supreme Court : ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు