Nasa : చంద్రుడిపై మట్టి అది బొద్దింకలకు పెడితే.. బయటకు తెచ్చి వేలంలోకి పెట్టిన సైంటిస్టు

అమెరికాలోని బోస్టన్ లో ఉన్న ఒక ప్రఖ్యాత ఆర్ఆర్ వేలం శాల వచ్చే నెల మొదట్లో కొంత మట్టిని అలాగే కొన్ని చనిపోయిన బొద్దింకలను వేలానికి పెట్టింది.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 09:00 AM IST

అమెరికాలోని బోస్టన్ లో ఉన్న ఒక ప్రఖ్యాత ఆర్ఆర్ వేలం శాల వచ్చే నెల మొదట్లో కొంత మట్టిని అలాగే కొన్ని చనిపోయిన బొద్దింకలను వేలానికి పెట్టింది. అయితే వాటిని వేలం పెడితే అటు ఇటుగా నాలుగు లక్షల దారులు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 3.2 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసుకుంది. ఇది కేవలం మట్టి బొద్దింకల కోసం అంత డబ్బు ఎందుకు అని అంటే.. అది మామూలు మట్టి కాదు. ఆ మట్టిని చందమామ మీద నుంచి తెచ్చినది. ఆ మట్టి పై ప్రయోగం కోసం బొద్దింకలను వాడారు. కానీ అవి అమెరికా ప్రభుత్వానికి చెందినది కావడంతో వెంటనే వేలం ఆపేసి తమకు అప్పగించాలని ఆ దేశ అంతరిక్ష సంస్థ అల్టిమేటం ఇవ్వడంతో వేలం ఆగిపోయింది. ఇంకా బొద్దింకలు మా మట్టి కథ విషయానికి వస్తే.. 1969లో అపోలో 11 వ్యోమనౌకలో నాసా చంద్రుడిపైకి మనుషులను పంపినప్పుడు అక్కడి మట్టిని భూమ్మీదికి తీసుకొచ్చారు.

తేవడం అయితే తెచ్చారు కాని ఆ మట్టి వల్ల ఏవైనా గ్రహాంతర సూక్ష్మజీవులు ఉండి, అవి వ్యాపించడం మొదలుపెడితే ఎలాగని నాసా శాస్త్రవేత్తలకు భయం పట్టుకుంది. దీనితో ఆ మట్టిలో కొన్ని బొద్దింకలను వేసి పరిశీలించారు. బొద్దింకలు ఆ మట్టిని తినేలా చేశారు. ఏవైనా గ్రహాంతర సూక్ష్మజీవులు ఉంటే బొద్దింకలపై ప్రభావం కనబడుతుందని భావించారు. మట్టిని తిన్న తర్వాత సదరు బొద్దింకలపై పలు రకాల పరీక్షలు చేశారు. ఇదంతా యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన మరియన్ బ్రూక్స్ అనే కీటకాల శాస్త్రవేత్త ఆధ్వర్యంలో జరిగింది. ఆ మట్టిలో ఎలాంటి గ్రహాంతర సూక్షజీవులు లేవని మరియన్ తన పరిశోధనలో గుర్తించారు.

అయితే ఆ మట్టిని, పరిశోధన చేసిన బొద్దింకలను తిరిగి నాసాకు పంపలేదు. ఆయన మరణించాక చంద్రుడి మట్టిని, చనిపోయిన బొద్దింకలను మరియన్ నివాసంలోనే ప్రదర్శించారు. 2010లో మరియన్ కుమార్తె వాటిని ఎవరో ఔత్సాహికులకు అమ్మేసింది. ఇన్నాళ్ల తర్వాత అవి ఆర్ ఆర్ వేలంశాలకు చేరాయి. కానీ అవి తమవేనని నాసా చెప్పడంతో వేలం ఆగిపోయింది. అసలు ఆ మట్టి పరిమాణం కేవలం 40 మిల్లీగ్రాములే.