Site icon HashtagU Telugu

Ganesh Housing : గుజరాత్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు

Ganesh Housing unveils visionary Million Minds Tech City

Ganesh Housing unveils visionary Million Minds Tech City

Ganesh Housing : గుజరాత్ ఐటి /ఐటీఈఎస్ పాలసీ 2022-27 కోసం గుజరాత్ ప్రభుత్వం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ భాగస్వామ్యంతో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ మూడవ రోడ్‌షోను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. అసోచామ్ సహకారంతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. భారతదేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రముఖ ఐటి మరియు ఐటీఈఎస్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ రోడ్ షో లో గణేష్ హౌసింగ్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, మిలియన్ మైండ్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్‌వర్క్‌కు పరిచయం చేయటం తో పాటుగా గుజరాత్ యొక్క పరివర్తనాత్మక కార్యక్రమాలు మరియు విధానాలను ప్రదర్శించారు.

Read Also: Operation Sindoor : పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్‌ దాడి..!

గుజరాత్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నమ్ముతోన్న గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మిలియన్ మైండ్స్ టెక్ సిటీ ఆవిష్కరణ ఈ రోడ్‌షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అసోచామ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి మాజీ ఛైర్మన్ మరియు ఫీనిక్స్ గ్రూప్ గ్రూప్ డైరెక్టర్ & భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ , EPCES ఛైర్మన్ శ్రీ శ్రీకాంత్ బాడిగతో పాటుగా గుజరాత్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి మోనా ఖాంధర్, ఐఏఎస్, శ్రీమతి కవితా రాకేష్ షా, ఐఏఎస్ డైరెక్టర్ – డైరెక్టరేట్ ఆఫ్ ఐసిటి & ఇ-గవర్నెన్స్, గుజరాత్ ప్రభుత్వం, గిఫ్ట్ సిటీ డైరెక్టర్ – IFSC విభాగం అధిపతి శ్రీ సందీప్ షా, ఐటి & ఐటీఈఎస్ – అసోచామ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సిటీఓ , ప్రణవ గ్రూప్, శ్రీ రాంబాబు బూరుగు కన్వీనర్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షుడు శ్రీ వీరేన్ మెహతా, ప్రముఖ పరిశ్రమ నాయకులు, విధాన నిర్ణేతలు మరియు గుజరాత్ ప్రభుత్వం నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. గుజరాత్ ఐటీ/ఐటీఈఎస్ పాలసీ 2022-27 కింద అందించే వివిధ ప్రోత్సాహకాలపై ఆకర్షణీయమైన సెషన్‌లు తగిన పరిజ్ఞానం అందించాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ హబ్‌గా నిలిపాయి.

ఈ కార్యక్రమం గురించి గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ అన్మోల్ పటేల్ తన సంతోషం వ్యక్తం చేస్తూ “భారతదేశంలో ప్రధాన ఐటీ హబ్‌గా వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది, అనేక ప్రముఖ టెక్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ వాటాదారులను కలుసుకోవటం మరియు మా మిలియన్ మైండ్స్ టెక్ సిటీ విలువ ప్రతిపాదనను ప్రదర్శించడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. హైదరాబాద్ రోడ్‌షోకు లభించిన అఖండ స్పందన మాకు నిజంగా సంతోషంగా ఉంది. తెలంగాణలోని పరిశ్రమ నాయకులు , వాటాదారులు చూపిన బలమైన నిబద్ధత డిజిటల్ ఆవిష్కరణలను నడిపించడంలో, ప్రతిభను పెంపొందించడంలో మరియు మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని సాధించడంలో గుజరాత్ ఐటీ/ఐటీఈఎస్ మరియు జిసిసి విధానాల పరివర్తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. ఈ రోడ్‌షోలు భారతదేశ సాంకేతిక దృశ్యాన్ని పునర్నిర్మించడంలో సహాయపడే అర్థవంతమైన భాగస్వామ్యాలు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తున్నాయని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి మోనా ఖాంధర్, ఐఏఎస్ మాట్లాడుతూ, “గుజరాత్ ఐటి/ఐటీఈఎస్ పాలసీ 2022-27 అత్యున్నత శ్రేణి తయారీ, ఆర్ &డి మరియు డిజిటల్ పరివర్తనను సజావుగా అనుసంధానించే శక్తివంతమైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే మా లక్ష్యం ప్రతిబింబిస్తుంది. ధోలేరాలోని సెమీకండక్టర్ హబ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు , నైపుణ్యం మరియు పరిశోధనలపై అధికంగా దృష్టి సారించటం వంటి మార్గదర్శక కార్యక్రమాలతో , పోటీతత్వ ప్రపంచ దృశ్యంలో అభివృద్ధి చెందడానికి మేము పరిశ్రమలు మరియు స్టార్టప్‌లను శక్తివంతం చేస్తున్నాము. అహ్మదాబాద్‌లోని దార్శనిక మిలియన్ మైండ్స్ టెక్ సిటీ వంటి ప్రాజెక్టులు సాంకేతికత , ఆవిష్కరణలకు ప్రాధాన్యత గమ్యస్థానంగా గుజరాత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి, మా వృద్ధి ఆశయాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తున్నాయి. ఈ సమగ్ర విధానం ద్వారా, వృద్ధిని నడిపించడమే కాకుండా 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో గుజరాత్ కీలక పాత్ర పోషించనుంది ” అని అన్నారు.

Read Also: Deputy CM Bhatti: జీతాలను ఆలస్యం చేసిన ఘ‌న‌త బీఆర్ఎస్‌ది: డిప్యూటీ సీఎం భ‌ట్టి