Suicide Attack: పాక్‌లో ఆత్మాహుతి దాడి..ఐదుగురు చైనా పౌరుల మృతి

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 05:06 PM IST

 

Suicide Attack: పాకిస్థాన్(Pakistan)లో ఆత్మాహుతి దాడి(suicide attack) జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa Province) లో చోటు చేసుకున్న ఈ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరణించినవారిలో ఐదుగురు చైనా(Chinese)జాతీయులు ఉన్నారు.

ఇస్లామాబాద్ నుంచి దసు ప్రాంతంలోని తమ క్యాంపునకు చైనా ఇంజినీర్ల బృందం వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లోని బిషమ్ తెహ్సిల్ వద్ద చైనా ఇంజినీర్ల కాన్వాయ్ వెళుతుండగా, ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దాడికి పాల్పడ్డాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడిలో ఐదుగురు చైనా ఇంజినీర్లు, వారి వాహనం డ్రైవర్ గా ఉన్న ఓ పాకిస్థానీ జాతీయుడు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, పేలుడు ధాటికి చైనా ఇంజినీర్ల వాహనం రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న ఓ గోతిలోకి ఎగిరిపడిందని, అనంతరం మంటల్లో చిక్కుకుందని పోలీసులు వివరించారు.

Read Also: YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి

ఈ ఆత్మాహుతి దాడి ఘటనను పాకిస్థాన్ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. చైనా పౌరులు మృతి చెందడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వ్యతిరేక శక్తులు ఎన్నటికీ పాకిస్థాన్-చైనా స్నేహాన్ని దెబ్బతీయలేవని జర్దారీ ఉద్ఘాటించారు.

Read Also: KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్

కాగా, ఈ ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు.