Begger: బిచ్చగాడి రూపంలో చనిపోయిన సాధుపుంగవుడు.. రూపాయి రూపాయి దాచిపెట్టిన ధనం పరులపాలు!

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 01:21 PM IST

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతోమంది బిచ్చగాళ్లను చూస్తూ ఉంటాము. అలా అడుక్కుంటున్న వాళ్ళు ఎవరు వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న విషయాలను ఎవరు పట్టించుకోరు. అయితే ఇలా రోడ్డు సైడ్ ఉన్న బిచ్చగాళ్ళు,యాచకులు చనిపోయిన తరువాత వారు ఎలాంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న సమాచారాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇప్పటికే పలువురు బిచ్చగాళ్ళు చనిపోయిన తర్వాత వారి వద్ద లక్షలకు లక్షల నోట్ల కట్టలను దాచుకుని వారు చనిపోయిన తర్వాత ఆ విషయాలు ఆ డబ్బులు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

అలా తాజాగా కూడా ఒక చనిపోయిన సాధువు వద్ద మూడు మూటల్లో డబ్బులు లభ్యమయ్యాయి. కాకినాడ జిల్లా కరప మండలం వేలంగి కి చెందిన రామకృష్ణ అనే సాధువు స్థానికంగా భిక్షాటన చేస్తూ, అలాగే రక్షరేకులు కడుతూ ఉండేవాడు. అలా అతను వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. తాజాగా అతను కన్నుమూయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టగా అతని రూమ్ ని పరిశీలిస్తే రెండు సంచి మూటలు కనిపించాయి.

ఆ మూటలు ఏంటా అని వాటిని తెరచి చూడగా అందులో చిల్లర నాణేలు అదేవిధంగా కరెన్సీ నోట్లు ఉన్నాయట. మొదట కార్మికుల సహాయంతో మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు ఆ తర్వాత అతని డబ్బు ఎక్కించాలి అని చూడగా చీకటి పడడంతో సాధ్యపడలేదు. దానితో ఆ నోట్లు చిల్లర సంచుల్లో పెట్టి సీలు వేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా యాచకుడు గా ఉంటూ రక్షరేకులు కడుతూ ఉండే ఆ సాధువు దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉండడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.