Site icon HashtagU Telugu

Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు రూ. 50 లక్షల జరిమానా విధించిన హైకోర్టు

Baba Ramdev got Rs. 50 lakh fine by the High Court

Baba Ramdev got Rs. 50 lakh fine by the High Court

Baba Ramdev: కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాబా రామ్‌ దేవ్‌కు బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమాని విధించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకుంది. పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా హైకోర్టులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు దాఖలైంది. ఈ కేసు కూడా కర్పూరం ఉత్పత్తులకు సంబంధించినది. ఆగస్టు 30, 2023న కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా పతంజలిని కోర్టు నిషేధించింది. ఇప్పుడు మధ్యంతర దరఖాస్తు ద్వారా, పతంజలి ఆర్డర్‌ను ఉల్లంఘించినట్లు కోర్టుకు సమాచారం వచ్చింది. దీంతొ జస్టిస్ ఆర్ ఐ చాగ్లా తాజా కేసును విచారించారు. ఆగస్టులో ఆర్డర్ జారీ చేసిన తర్వాత పతంజలి స్వయంగా కర్పూరం ఉత్పత్తులను సరఫరా చేసినట్లు వారు గుర్తించారు. ఆగస్టు 30, 2023న ప్రతివాది నం. 1 నాటి నిషేధ ఉత్తర్వును పదే పదే ఉల్లంఘిస్తే కోర్టు సహించదు’ అని కోర్టు పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లోగా రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని పతంజలి ఆయుర్వేదాన్ని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత పతంజలి అఫిడవిట్ ఇచ్చిందని, అందులో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరగా, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పినట్లు సమాచారం. ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత జూన్ 2024 వరకు డిస్ట్రిబ్యూటర్లకు రూ.49 లక్షల 57 వేల 861 విలువైన కర్పూరం ఉత్పత్తిని సరఫరా చేసినట్లు అఫిడవిట్‌లో అంగీకరించారు. ఇంకా రూ.25 లక్షల 94 వేల 505 విలువైన ఉత్పత్తులు డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్నాయని, వాటి విక్రయాలను నిలిపివేసినట్లు తెలిపారు.

Read Also: Red Book : ఇప్పుడు ‘రెడ్ బుక్’ అనే టైటిల్‌తో ఓ సినిమా..!

జూన్ 2024 తర్వాత కూడా పతంజలి ఉత్పత్తులను విక్రయించినట్లు మంగళం ఆర్గానిక్స్ పేర్కొంది. జులై 8 వరకు వెబ్‌సైట్‌లో కర్పూరం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని కోర్టుకు తెలియజేసింది. మంగళం ఆర్గానిక్స్ ఇచ్చిన ఈ సమాచారం పతంజలి అఫిడవిట్‌లో లేదు. 50 లక్షలు డిపాజిట్ చేయాలని పతంజలిని కోరడంతో పాటు, అఫిడవిట్ దాఖలు చేయాలని మంగళవం ఆర్గానిక్స్‌ను కూడా కోర్టు కోరింది. ఈ అంశంపై తదుపరి విచారణ జూలై 19న జరగనుంది.

Read Also:Sourav Ganguly: సెహ్వాగ్, ధోనీ కోసం గంగూలీ త్యాగం 

మరోవైపు పతాంజలి గ్రూపు 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల ప్రకటనలపై ఆ సంస్థపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.