LAWCET : ఆంధ్రప్రదేశ్లో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించబోయే లాసెట్ (LAWCET) 2025 కు సంబంధించి తాజా అప్డేట్ వెలుగులోకి వచ్చింది. మూడేళ్లు మరియు ఐదేళ్ల లా కోర్సుల్లో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థుల కోసం నిర్వహించే ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన లాసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగనుంది. లాసెట్ 2025 ఫలితాలను జూన్ 22న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాల ఆధారంగా అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇక నుంచి అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను తరచూ పరిశీలిస్తూ తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండాలి.
ఏపీ లాసెట్ హాల్ టికెట్లు – ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
.అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
.హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
.ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
.డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
.ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందాలి.
.పరీక్షా కేంద్రంలోకి వెళ్లటానికి హాల్ టికెట్ తప్పనిసరి. అడ్మిషన్ ప్రక్రియలోనూ ఉపయోగపడుతుంది.
ఏపీ లాసెట్ – 2025 పరీక్ష విధానం
ఏపీ లాసెట్ పరీక్షలను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. సీబీటీ విధానంలో ఉంటుంది. మొత్తం 3 సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏ లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 30 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ బీలో కరెంట్ ఎఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 60 మార్కులు భారత రాజ్యాంగం, లీగల్ అప్టిట్యూడ్ నుంచి అడుగుతారు. ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ చూస్తే… రెండు సెక్షన్లు ఉంటాయి. లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషన్ లా, బిజిెన్స్ అండ్ కార్పొరేట్ లా, JURISPRUDENCE, భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 మార్కులకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. వీటికి తోడు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడదలవుతుంది. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
Read Also: Baby Bump : ముచ్చటగా మూడోసారి అంటున్న ‘సై’ బ్యూటీ