250 Lottery-Won 10 Crore : జాక్ పాట్ తగలడం అంటే ఇదే !!
11 మంది మహిళలు కలిసి చెరో రూ.25 పోగేసి రూ.250తో లాటరీ టికెట్ కొన్నారు.
అది కాస్తా తగిలి వాళ్లకు రూ.10 కోట్లు వచ్చాయి..
Also read : Prabhas FB: ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్.. డార్లింగ్ టీం అలర్ట్
కేరళలోని మలప్పురం జిల్లా పరప్పణగాడి టౌన్ కు చెందిన 11 మంది పేద మహిళలు.. లాటరీ తగలడంతో రాత్రికిరాత్రి కోటీశ్వరులు అయ్యారు. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ గత బుధవారం డ్రా తీయగా.. ఈ మహిళలు కొన్న టికెట్కే జాక్పాట్ తగిలింది. ఈ లాటరీ ప్రైజ్ మనీ రూ.10కోట్లు కావడంతో ఆ మహిళల ఆనందానికి అవధి లేకుండా పోయింది. “మా కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు, అప్పులు, మెడికల్ ట్రీట్మెంట్స్ ఇలా ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయి. ఈ డబ్బుతో మా సమస్యలు తీరుతాయి’’ అని ఆ మహిళలు చెప్పారు. పరప్పణగాడి టౌన్ మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. ఈ విభాగంలోని సిబ్బంది భూమిలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తారు. ఇప్పుడు లాటరీ తగిలిన 11 మంది మహిళలు(250 Lottery-Won 10 Crore) కూడా హరిత కర్మ సేనలోని సభ్యులే.
Also read : Congress vs BRS; కాంగ్రెస్ బురద రాజకీయాలు: BRS