Telangana: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల. ధనిక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానంటూ అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపణలు చేశారు షర్మిల. ఈ మేరకు సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు చేశారు.
రాష్ట్రం పేరిట “అప్పులు చేసి దొర పప్పు కూడు” తింటూ ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నడు అంటూ ఆరోపించారు. బంగారు తునకలాంటి ధనిక రాష్ట్రాన్ని.. తన ధన దాహానికి బలి చేసి.. అప్పు పుట్టనిదే, ఉన్న భూములు అమ్మనిదే రాష్ట్రం ముందుకు పోలేని దీనస్థితికి తెచ్చిండని విమర్శించారు. 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేకపాయే అని దుయ్యబట్టారు. స్కాములతో నిధులన్ని స్వాహా చేసి.. స్కీములను “కాం” చేశారు. ఇంతకాలం దోచుకుతిన్నది చాలక ఎన్నికలకు మూడు నెలల ముందు పథకాలకు అప్పులు కావాలని కేంద్రం వద్ద కొత్త డ్రామాకు తెర లేపుతున్నడు సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు.
మరో లక్ష కోట్ల అప్పులకు తంటాలు పడే కేసీఆర్ గారు.. తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పులతో రుణమాఫీ కింద 21 వేల కోట్లు ఎందుకు మాఫీ చేయలే ? 12 లక్షల మంది పక్కా ఇండ్లకు దరఖాస్తు పెట్టుకుంటే ఎందుకు కట్టలే? దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు కొనియ్యలే ? ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన 5 వేల కోట్లు ఎందుకు చెల్లించలే ? 20 వేల కోట్లతో ఉచిత ఎరువులు ఎందుకు కొనలే ? 50 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలే ? కాంట్రాక్టర్లకు 37 వేల కోట్ల బిల్లులు ఎందుకు విడుదల చేయలే? అభివృద్ధి కోసమే అప్పులు చేసే మీరు.. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడ పెట్టారు ? మీ అభివృద్ధి ఎక్కడ ? TRS ను BRS గా మార్చడమేనా మీరు చెప్పే అభివృద్ధి? చేసిన అప్పులను సొంత ఖజానాకు మళ్లించి, రాష్ట్ర సంపదను విలాసాలకు వాడుకుంటూ ఒక్కో నెత్తిపై 2 లక్షల అప్పు పెట్టిన మీకు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయి అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.
Also Read: Vastu Tips: ఇంట్లో ఈ మొక్కను పెంచితే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?