BSP: మునుగోడు ఉపఎన్నిక‌ బీఎస్పీ అభ్య‌ర్థి ఎవ‌రంటే..?

మునుగోడు ఉపఎన్నిక‌లో బీఎస్పీ అభ్య‌ర్థిగా శంక‌రాచారిని పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్ర‌క‌టించారు.

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 04:42 PM IST

మునుగోడు ఉపఎన్నిక‌లో బీఎస్పీ అభ్య‌ర్థిగా శంక‌రాచారిని పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్ర‌వంతి, బీజేపీ నుంచి రాజగోపాల్, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఆయా పార్టీలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవ‌ల‌ నోటిఫికేషన్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నెల 7 నుంచి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14తో నామినేషన్ల గడువు ముగియనుంది.

నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా 6న ఓట్లను లెక్కించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక బరిలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. అటు టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల పోటీ చేయ‌నున్న‌ట్లు టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. తాజాగా బీఎస్పీ నుంచి శంక‌రాచారి పోటీ చేస్తున్న‌ట్లు బీఎస్పీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే మునుగోడులో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది.