Asifabad : ఆసిఫాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం.. వ‌డ‌దెబ్బ‌తో వ‌రుడు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో ని ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెల‌కొంది. పెళ్లికి ముందు రోజు వరుడు వడదెబ్బతో మృతి చెందడంతో ఆ

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 08:41 AM IST

ఆసిఫాబాద్ జిల్లాలో ని ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెల‌కొంది. పెళ్లికి ముందు రోజు వరుడు వడదెబ్బతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయ‌లు అల‌ముకున్నాయి. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన గిరిజనుడు గుండ్ల తిరుపతి(26) సోమవారం తన బంధువులు, స్నేహితులకు వివాహ ఆహ్వానపత్రికలు పంచిపెట్టి వ‌చ్చాడు. ఆ త‌రువాత అత‌నికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. తొలుత మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భీమిని మండల కేంద్రానికి చెందిన యువతితో తిరుపతికి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అతని కుటుంబ సభ్యులు వివాహ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే వ‌రుడు తిరుప‌తి అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతి సోదరుడు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కౌటాల మండలంలో గత రెండు వారాలుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతోంది.