Site icon HashtagU Telugu

Fake Passport Scam : నకిలీ పాస్​పోర్ట్​ స్కామ్​లో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్.. ఏమిటీ కుంభకోణం ?

Passport

Passport

Fake Passport Scam : నకిలీ సర్టిఫికెట్లతో శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి మన దేశ పాస్‌పోర్టులు ఇప్పించిన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది.  తెలంగాణ సీఐడీ దర్యాప్తులో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పోలీసులను సీఐడీ విభాగం అరెస్టు చేసింది. గతేడాది హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న సమయంలో నకిలీ పాస్‌పోర్టు ముఠాకు ఈ ముగ్గురు సహకరించినట్లు తేలింది. పంజాగుట్ట ఎస్బీ విభాగంలో పనిచేసి ప్రస్తుతం షీటీంలో ఏఎస్సైగా ఉన్న గుంటూరు వెంకటేశ్వర్లు, మారేడ్‌పల్లి ట్రాఫిక్ ఏఎస్సై తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్సై షేక్ నజీర్ బాషను సీఐడీ అరెస్ట్ చేసింది. వీరితోపాటు ఎస్​ఆర్​నగర్​లోని ఆధార్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు కొప్పిశెట్టి కల్యాణ్‌ను కూడా సీఐడీ రిమాండ్‌కు తరలించింది.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు ?

ఎవరీ సత్తార్ ? 

Also Read :Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్‌బై.. ఎందుకు ?