KA Paul: కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా ఇదే!

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి.

  • Written By:
  • Updated On - November 6, 2023 / 04:35 PM IST

KA Paul: ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ప్రధాన పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే తొలి, రెండు జాబితాలను విడుదల చేయగా, చిన్నా చితక పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎంఐఎం పార్టీ 9 తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనున్నట్టు, తొలి జాబితాలో భాగంగా 6 స్థానాలను ప్రకటించింది. తాజాగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో మొత్తం 12 స్థానాలను ఖరారు చేశారాయన.

పోటీ చేసే స్థానాలివే

చెన్నూరు: మొయ్య రాంబాబు

జుక్కల్‌ (ఎస్సీ): కర్రోల్ల మోహన్‌

రామగుండం: బంగారు కనకరాజు

వేములవాడ: అజ్మీరా రమేశ్‌బాబు

నర్సాపురం: సిరిపురం బాబు

జహీరాబాద్‌: బేగరి దశరథ్‌

గజ్వేల్‌: పాండు

ఉప్పల్‌: కందూరు అనిల్‌ కుమార్‌

యాకుత్పురా: సిల్లివేరు నరేశ్‌

కల్వకుర్తి : కట్టా జంగయ్య

నకిరేకల్‌: కదిర కిరణ్‌కుమార్‌

మధిర : కొప్పుల శ్రీనివాస్‌ రావు

Also Read: Delhi: ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి, కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం