Site icon HashtagU Telugu

Self Made Entrepreneurs : స్వయం కృషితో ఎదిగిన 200 మంది శ్రీమంతుల్లో 13 మంది తెలుగువారు

Telugu Rich People Self Made Entrepreneurs Idfc First Hurun India

Self Made Entrepreneurs : స్వయం కృషిని మించిన సాధన లేదు. సొంతంగా కష్టపడి  పారిశ్రామికవేత్తలుగా, శ్రీమంతులుగా మారిన 200 మంది దిగ్గజాల పేర్లతో ‘‘ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్, హురున్‌ ఇండియా’’ సంయుక్తంగా జాబితాను విడుదల చేశాయి. ఇందులో మన తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

Also Read :Balagam Mogiliah : ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య ఇక లేరు..

జాబితాలో తెలుగువారు..

Also Read :Fake Payment Apps: న‌కిలీ పేమెంట్‌ల‌కు చెక్ పెట్ట‌నున్న ఫోన్‌పే!

  • మెడ్ ప్లస్‌కు చెందిన మధుకర్ గంగిడి 119వ స్థానంలో నిలిచారు.
  • బొండాడ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన రాఘవేంద్రరావు 142వ స్థానం సాధించారు.
  • జాగిల్ ప్రీపెయిడ్‌కు చెందిన రాజ్ ఫణి 160వ స్థానంలో, టీమ్ లీజ్ సర్వీసెస్‌కు చెందిన అశోక్ రెడ్డి 162వ స్థానం సాధించారు.
  • ఈ లిస్టులో 2వ స్థానంలో జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ నిలిచారు. ఆయన  నికర సంపద గత ఏడాది వ్యవధిలో 190% పెరిగింది.
  • ఈ లిస్టులోని టాప్-10లో  ఉన్న మేక్‌మై ట్రిప్‌ వ్యవస్థాపకుల సంపద 168% పెరిగింది.  పాలసీబజార్‌ వ్యవస్థాపకుల సంపద 128% పెరిగింది.
  • ఈ లిస్టులో జెప్టో వ్యవస్థాపకులు కైవల్య ఓహ్రా 21వ స్థానంలో, జెప్టోకే చెందిన ఆదిత్‌ పలిచా 22వ స్థానంలో, భారత్‌పే వ్యవస్థాపకులు శాశ్వత్‌ నక్రానీ 26వ స్థానంలో నిలిచారు.
  • ఈ జాబితాలో బెంగళూరు నుంచి అత్యధికంగా 66  కంపెనీలు కనిపించాయి. తర్వాతి స్థానాల్లో ముంబై(36), గురుగ్రామ్‌(31),  ఢిల్లీ(15), చెన్నై(12), పుణె(7), హైదరాబాద్‌(6) నిలిచాయి.
  • ఈ లిస్టులో 10 ఏళ్లలోపు కంపెనీలు 97 ఉండగా..వీటి మొత్తం విలువ రూ.11 లక్షల కోట్లు. అయిదేళ్ల కిందట పెట్టిన 13 కంపెనీల విలువ రూ.1,43,600 కోట్లుగా ఉంది. 77 యూనికార్న్‌లకు చెందిన 176 మంది వ్యవస్థాపకులూ ఈ జాబితాలో ఉన్నారు.